Anasuya counter to Revanth Reddy : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల మధ్య విమర్శల జోరు పెరిగింది. ఒకరిపై మరొకరు తీవ్ర పదజాలంతో దూషించుకుంటున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరుష పదజాలాన్ని ప్రయోగించారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో హుందాగా ఉండాలి కానీ ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి ఆజ్యం పోస్తాయి. వ్యక్తుల మధ్య దూరం పెంచుతాయి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై ప్రముఖ తెలుగు నటి, వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడని అనసూయ ఈమారు రేవంత్ రెడ్డి మాటలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
టీవీ చానల్స్ చేతిలో ఉన్నాయని లోఫర్ నా కొడుకులు అంటూ అడ్డంగా తిట్టారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు అందరిని బాధించాయి. రాజకీయాల్లో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం మామూలే కానీ ఇలా అసభ్య పదజాలం వాడటం బాగా లేదు. అలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించడంపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేవంత్ రెడ్డి వాడిన పదజాలంపై సోషల్ మీడియాలో కామెంట్లు పెరుగుతున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్నారు. ఓ ప్రైవేటు చానల్ ను ఉద్దేశించి రేవంత్ మాట్లాడిన మాటలు నెటిజన్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాజకీయ నేతలు విలువలు కాపాడాల్సిన అవసరం ఉంది. అసభ్య పదజాలం వాడితే వారి స్థాయి పడిపోతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.