AP CID : మార్గదర్శి సంస్థ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే కారణంతో ఇటీవల రామోజీ రావు కోడలు శైలజాకిరణ్ ను సీఐడీ ప్రశ్నించింది. చందదారుల సొమ్ము ఎక్కడికి తరలించారనే కోణంలో సీఐడీ విచారించింది. సంస్థకు చెందిన రూ. 793.50 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. మరోవైపు శైలజా కిరణ్ ను విచారించిన అనంతరం మరిన్ని ఆస్తులను అటాచ్ చేస్తారని ప్రచారం జోరుగా నడుస్తోంది.
ఈమేరకు మార్గదర్శి చిట్స్ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లగా సుప్రీంకోర్టు నిరాకరించింది. శైలజాకిరణ్ విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసు ఇవ్వడాన్ని సైతం తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. దానిని కోట్టివేస్తూ తీర్పు వెలువరించింది. అయితే తాజాగా జూబ్లీ హిల్స్ లోని రామోజీ రావు నివాసానికి ఏపీ సీఐడీ చేరుకొని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ను విచారిస్తుండటం ఆసక్తిని రేపుతోంది.