APSRTC : తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయా ణంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీఎస్ఆ ర్టీసీ ఎండి ద్వారకాతిరుమలరావు స్పందించారు. మహిళలకు ఫ్రీ జర్నీ పై ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని తెలిపారు. దీనిపై ప్రభు త్వమే విధానపర మైన నిర్ణయం తీసుకుం టుంద ని స్పష్టం చేశారు. రాబోయే 4 నెలలో 1500 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. అయితే ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో అమలు అవుతున్న మహిళలకు ఫ్రీ బస్సు సర్వీ సులను ఏపీలో కూడా ప్రవేశ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధి కారుల తో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాలో చనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కంటే ముందు ఈ పథకం ప్రారంభించడం వల్ల మళ్లీ అధికారం లోకి రావచ్చు అన్న ఆలోచన చేస్తు న్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం నిర్ణ యం తీసు కోవాల్సి ఉందని ఆర్టిసి ఎండి తెలిపారు.