Babu Jail Again : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కోర్టు అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేవలం కంటి, ఇతర జబ్బులకు సంబంధించిన సమస్యలు ఉండటంతో ఆయన ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించింది. దీంతోనే రాజకీయ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనరాదని చెప్పింది. దీంతో ఆయన కూడా అలాగే ఉంటున్నారు.
తాజాగా తెలుగువీరలేవరా అనే పాటను విడుదల చేయడంతో అది బ్రహ్మాండమైన హిట్ అయింది. దీంతో దీని విజయోత్సవ సభ ఈ నెల 11న విశాఖ పట్నంలో నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను తన నివాసంలో బాబు ఆవిష్కరించారు. ఇది కాస్త ఈనాడులో రావడంతో అందరు షాకయ్యారు. బెయిల్ ను దుర్వినియోగం చేశారనే వాదనలు వస్తున్నాయి.
రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, మీడియాతో మాట్లాడకూడని కోర్టు అభిప్రాయపడింది. ఆరోగ్యపరమైన అంశాలకు మాత్రమే బెయిల్ సద్వినియోగం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ కార్యకర్త అత్యుత్సాహంతో ఈనాడులో ప్రచురితం కావడంతో చర్చనీయాంశం అయింది. చంద్రబాబు అరెస్టు తరువాత ఆయనకు సంఘీభావంగా ఒక సంస్థ తెలుగువీరలేవరా పాట తీసుకొచ్చారు.
ఇప్పుడు పత్రికలో కథనం రావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాబు కార్యకలాపాలు ఆరోగ్య పరంగా కాకుండా రాజకీయ పరంగా ఉంటున్నాయనే వాదనలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో సొంత పార్టీ వాళ్లే బాబును దొంగను చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలా బాబు వ్యవహారం రోజుకో వివాదంగా మారుతున్నాయి. టీడీపీ శ్రేణుల వ్యవహారం ప్రశ్నార్థకంగా మారుతోంది.