ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లోని షాదోల్ జిల్లా బదోలి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..
ఏఎస్సై మహేంద్ర బాగ్రి ఒకరిని అరెస్టు చేసేందుకు ఇద్దరు సహోద్యోగులతో కలిసి వెళుతుండగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక ట్రాక్టర్ వారికి ఎదురైంది. ట్రాక్టర్ ను ఆపాలని డ్రైవర్ రాజ్ రావత్ కు సూచించినా వినకుండా ట్రాక్టర్ ను ఏఎస్సై మీదుగా పోనిచ్చాడు. దీంతో ఏఎస్సై బాగ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.