Tarun : తరుణ్.. ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.. టాలీవుడ్ లో బాల నటుడిగా పరిచయం అయ్యి మంచి మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మరిన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల చేత లవర్ బాయ్ గా పిలిపించుకున్నాడు.. వరుసగా ప్రేమ కథ సినిమాలను చేసిన తరుణ్ అప్పట్లో సంచలనం సృష్టించాడు.
అయితే అనూహ్యంగా ఈయన సినిమాలకు దూరం అయ్యాడు.. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.. మరి తాజాగా తరుణ్ తాను చేసిన నువ్వే నువ్వే సినిమాకు 20 ఏళ్ళు అయిన సందర్భంగా బయటకు వచ్చి మీడియాకు దర్శనం ఇచ్చాడు. ఇదిలా ఉండగా తరుణ్ తల్లి అలనాటి హీరోయిన్ రోజా రమణి తన కొడుకు తరుణ్ గురించి ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది.
రాజా రమణి మాట్లాడుతూ.. తరుణ్ చిన్నప్పటి నుండి సాయం చేయడంలో ముందు ఉంటాడు.. అలాగే భక్తి కూడా ఎక్కువే.. ప్రతీ రోజు గంటన్నర పూజ చేయకుండా బయటకు వెళ్ళడు.. నేను చేసిన మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నాను.. ఇక తరుణ్ కూడా తాను నటించిన మొదటి సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నాడు.. అప్పుడు నేను మా వారు కన్నీళ్లు పెట్టుకున్నాం.. మాకు చాలా సంతోషంగా అనిపించింది.
అలాగే తరుణ్ మీద వచ్చిన రూమర్స్ గురించి కూడా ఈమె స్పందించారు.. ఎలాంటి ఆధారాలు లేకుండానే రూమర్స్ రాస్తారు.. వాటిని విన్నప్పుడు చాలా బాధేస్తుంది.. వాటిని అస్సలు పట్టించుకోము.. ప్రస్తుతం అందరి ఆశీస్సులతో మేము బాగున్నాం.. ప్రస్తుతం తరుణ్ పెళ్లి మాత్రమే మాకు ఉన్న కోరిక.. త్వరలోనే తరుణ్ సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. మీ ఆశీర్వాదంతో మరోసారి రాణిస్తాడు అని చెప్పుకొచ్చారు.