Bhashyam Praveen Campaign : అచ్చంపేట మండలం, కొత్తపల్లి గ్రామంలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ శుక్రవారం పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు.
అనంతరం భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని అందరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి గెలుపు కోసం పాటుపడాలన్నారు. తొలుత గ్రామంలో రోడ్ షో నిర్వహించి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.