BJP First List : తెలంగాణ ఎన్నికల్లో బరిలో దిగే బీజేపీ టీం రెడీ అవుతున్నది. ఇప్పటికే 35 నుంచి 40 మందితో ఫస్ట్ లిస్ట్ రెడీ అయినట్లు సమాచారం. పార్టీ రాష్ర్ట అధ్యక్షడు ఇప్పటికే అధిష్టానంతో రెండు సార్లు చర్చించి వీరిని ఫైనల్ చేసినట్లు తెలుస్తున్నది. సోమవారం జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం లిస్ట్ ప్రకటించనున్నారు. ఈ రాజకీయ ఫైట్ లో ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించేసింది. కాంగ్రెస్ కూడా మెజార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది.
ఇక ఈ రేసులో బీజేపీ కూడా సోమవారం తొలి జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నది. అభ్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా ఇప్పటికే ఎంపిక చేస్తున్నారు. అయితే గజ్వేల్, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఆయన గజ్వేల్ సీఎం కేసీఆర్ ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో కూడా పోటీ చేయనున్నారు. అయితే కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, లక్ష్మణ్, విజయశాంతి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది రేపు ప్రకటించే జాబితా తేలిపోనుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నుంచి రఘునందన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు మరోసారి కూడా దుబ్బాక నుంచి అవకాశం దక్కనుంది.
ఇక కల్వకుర్తి నుంచి ఆచారి, ఇబ్రహీం పట్నం నుంచి దయానంద్ గౌడ్, ఎల్బీ నగర్ నుంచి మనోహర్ రెడ్డి, మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పాల్వాయి హరీశ్ బాబు, ఆదిలాబాద్ నుంచి సుహాసిని, బోథ్ నుంచి సోయం బాపురావ్, నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ నుంచి రాథోడ్ రమేశ్, నిజామాబాద్ అర్బన్ నుంచి యెండల లక్ష్మీనారాయణ, కోరుట్ల నుంచి ధర్మపుర అరవింద్, బాల్కోండ నుంచి అన్నపూర్ణమ్మ, జుక్కల్ నుంచి అరుణ తార, జగిత్యాల నుంచి బోగి శ్రావణి, ధర్మపురి నుంచి వివేక్ వెంకటస్వామి, మంథని చందుపట్ల సునీల్ రెడ్డి, పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్ రావు, చొప్పదండి నుంచి బోడిగె శోభ, మానకొండూరు నుంచి ఆరేపల్లి మోహన్, వేములవాడ నుంచి వికాస్ రావు, సంగారెడ్డి నుంచి దేశ్ పాండే, ఆందోల్ నుంచి బాబూ మోహన్ పోటీ చేయనున్నట్లు సమాచారం.