- భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
Sudarshana Homam : అమెరికాలోని న్యూ జెర్సీలో శ్రీ సాయి దత్త పీఠం పరిధిలో కొనసాగే శ్రీ శివ విష్ణు దేవాలయంలో అమెరికాలోని బీజేపీ నాయకులు సుదర్శన హోమంను ఆదివారం ఏప్రిల్ 28వ తేదీ వైభవంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు హోమంలో పాల్గొన్నారు. ‘ఆప్ కీ బార్ 400 పార్’ అంటూ నినాదాలు చేస్తూ.. భారత్ లో బీజేపీ గెలవాలని, నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి, ప్రపంచానికి చాలా అవసరమని వారు అన్నారు.
ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్, వికసిత్ భారత్, మినిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ కేవలం బీజేపీతోనే సిద్ధిస్తుందని అమెరికా బీజేపీ అభిమానులు అన్నారు. ప్రపంచంలో నేడు భారత్ జోక్యం లేనిదే ప్రపంచంలోని భారీ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని, విశ్వ గురువుగా భారత్ ఎదిగిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని వారు పేర్కొన్నారు.
న్యూ జెర్సీలోని ఏర్పాటు చేసిన ఈ సుదర్శన హోమం మంచి ఫలితాలను ఇస్తుందని, ఎక్కువ సంఖ్యలో బీజేపీ సపోర్టర్స్ ఈ హోమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మహా కూటమి అధికారంలోకి వస్తే మరోసారి డెవలప్ ఊపందుకుంటుందని వారు అంటున్నారు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)
More Images : BJP USA conducted Sudarshana Homam at SDP SSV Temple