మహేశ్ బాబుకు కాలం కలిసి వస్తుందనే చెప్పాలి. తన ఇంట్లో కొన్ని అశుభకార్యాల మినహా ఆయన కెరీర్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు. మహేశ్ బాబు చేతిలో ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో #SSMB28 తీస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణానికి ముందే ఈ సనిమా పట్టాలెక్కినా.. ఆయన మరణానంతంరం వచ్చిన గ్యాప్, తర్వాత మహేశ్ టూర్ కు వెళ్లడం ఇలా ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ను మళ్లీ ప్రారంభించినట్లు మూవీ యూనిట్ తెలిపింది.
#SSMB28 చిత్రం హారికా హాసినీ క్రియేషన్ భ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, పూజాహెగ్డే ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సనిమాకు సంబంధించి ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ కు వరుస అవాంతరాలు కలగడంతో లేట్ అయ్యింది. ఇందులో భాగంగా త్రివిక్రమ్ తన తర్వాతి ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ తో చేస్తుండడంతో ఆ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు త్రివిక్రమ్. మహేశ్ బాబు కూడా కొంత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
#SSMB28లో మహేశ్ బాబు నాయకుడి పాత్ర వేస్తే జగపతి బాబు ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారట. హీరోకు తాతగా ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వీరితో పాటు భారీ తారాగణం ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా ఇందులో నటిస్తున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. ఆయన ఒక బిజినెస్ మెన్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇంత క్రేజీ కాంబోతో వస్తున్న ఈ మూవీని ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు ప్రకటించాయి.