Chiranjeevi :
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విరామం తీసుకుని విహారయాత్రలో ఉన్నారు. అమెరికాకు వెళ్లబోతున్నట్లు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఊహించినట్లుగానే అతను ఈ రోజు (జూలై 7)న సోషల్ మీడియాలో ఒక ఫొటోను విడుదల చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కూతురి నిర్మాణ సంస్థలో తన తదుపరి చిత్రం గురించి పరోక్షంగా హింట్ ఇచ్చాడు.
చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఫ్లైట్ నుంచి దిగిన ఫొటోను షేర్ చేశారు. చిన్న హాలిడే కోసం అమెరికాకు వెళ్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. అదే పోస్ట్ లో తన తదుపరి చిత్రం ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణంలో ఉందని కన్ఫర్మ్ కూడా చేశాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి మీడియాలో చర్చలు జరిగాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్గా ఉంటుందని మాత్రమే చెప్పిన చిరంజీవి దర్శకుడి వివరాలు చెప్పలేదు.
రాం చరణ్ నటుడిగానే కాకుండా.. నిర్మాతగా కూడా చాలా ఫేమస్ అయ్యాడు. గతంలో చిరంజీవితో తన బ్యానర్ ‘కొనిదెల ప్రొక్షన్ కంపెనీ’లో రెండు సినిమాలు తీశాడు. అవి ఆశించినంత విజయం సాధించలేకపోయింది. రీసెంట్ గా నిర్మాణ సంస్థ పేరును మార్చాడు. ‘వి మెగా పిక్చర్స్’ దీని ద్వారా ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌజ్’ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
అయితే, చిరంజీవి తన పెద్ద కూతురు శ్రీజను కూడా నిర్మాణ రంగంలో సెటిల్ చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకు తగ్గ ప్లాన్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆమె స్థాపించిన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ లో తన తర్వాత చిత్రం అని సోషల్ మీడియాలో భారీగా టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్ట్ 22) సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు చిరు ‘భోళా శంకర్’ షూటింగ్ డబ్బింగ్ పూర్తి చేసి వచ్చే నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.