Ganga River coin Hunting : మనదేశంలో నదుల్లో డబ్బులు వేస్తుంటారు. కొందరు వాటిని కొల్లగొట్టేందుకు అయస్కాంతాలు వాడుకుని చిల్లరను దోచుకుంటున్నారు. నదిలో వేసిన వాటిని కూడా వదలడం లేదు. ఈ క్రమంలో అయస్కాంతాలతో బిళ్లల వేట కొనసాగిస్తున్నారు. నదిలో వేసిన చిల్లరను తీసుకుంటున్నారు. దీంతో ఉపాధి పొందుతున్నారు. చివరకు చిల్లరను కూడా దక్కనివ్వడం లేదు.
మనదేశంలో నదులకు పవిత్ర స్థానం కల్పించారు. కానీ నేడు అవి కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. కలుషితమైన పదార్థాలు పడేయడంతో నదులు అస్తవ్యస్తంగా అవుతున్నాయి. దీంతో వాటిలోని నీరు కాలుష్యంగా కనిపిస్తోంది. నదులను పవిత్రంగా చూసుకోవాల్సిన మనమే వాటిని పాడు చేస్తున్నాం. చెత్త, చెదారం పడేయడంతో అవి మురికి కూపాలుగా మారుతున్నాయి.
స్వచ్ఛమైన నీటితో కనిపించాల్సిన నదులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. దేశంలో గంగానదిని అత్యంత పుణ్య నదిగా భావిస్తారు. కానీ అందులో ఉన్నంత మురికి మరే నదిలో ఉండదంటే అతిశయోక్తి కాదు. గంగానదిలో శవాలు దహనం చేయడంతో నీరంతా మురికిగా మారుతోంది. ఈ నేపథ్యంలో నదిని ప్రక్షాళన చేయాలని సంక్పల్పించినా కుదరడం లేదు.
పూర్వం రోజుల్లో రాగి పైసలు ఉండటంతో వాటిని ఆ నదిలో వేస్తే నీరు శుభ్రమవుతుందని భావించి అందులో వేసే వారు. కానీ ఇప్పుడు కూడా రూపాయి బిళ్లలను గంగలో విసిరేస్తున్నారు. దీంతో వాటిని తీసుకుని కొందరు ఉపాధి పొందుతున్నారు. నదిలో పైసలు వేయడం వల్ల నీరు కలుషితంగా మారుతుంది. ఈ విషయం అందరికి తెలిసినా నిర్లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నారు.
గంగ, గోదావరి, క్రిష్ణ, కావేరి, తుంగభద్ర వంటి జీవనదులు మన దేశంలో ఉన్నాయి. నదీపరివాహక ప్రాంతంలో నివసించడం మానవ నాగరికత. ఈనేపథ్యంలో నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది. సహజ వనరులను కాపాడుకోకపోతే ఇబ్బందులు రావచ్చు. భవిష్యత్ బంధకారమే కావచ్చు. అందుకే ముందే మేల్కొని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.