Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప ది రూల్’.. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రైజ్ సినిమా 2021లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండానే వరల్డ్ వైడ్ గా 400 కోట్లను రాబట్టింది.
ఇక ఈ రేంజ్ లో హిట్ కొట్టడంతో ఈయన క్రేజ్ కు ఎల్లలు లేకుండా పోయింది. ఈ సినిమా కథ పార్ట్ 1 తోనే పూర్తి అవ్వక పోవడంతో పార్ట్ 2 మరింత గ్రాండ్ గా పెరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా వాటికీ యునానిమస్ రెస్పాన్స్ లభించింది.
ఇక ఇటీవలే పార్ట్ 1 కు అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడంతో పుష్ప ది రూల్ పై మరింత క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తాజాగా ఇంస్టాగ్రామ్ తో కొలాబరేట్ అయ్యి తన లైఫ్ స్టైల్ తో పాటు పుష్ప 2 షూట్ ఎలా జరుగుతుందో కూడా ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ సుకుమార్ కలిసి స్క్రిప్ట్ పట్టుకుని డిస్కర్స్ చేసుకుంది కూడా చూసాం..
మరి అలా వీడియో రిలీజ్ చేసారో లేదో వెంటనే ఆ స్క్రిప్ట్ పేపర్ ను స్క్రీన్ షాట్ తీసి మరీ ఫ్యాన్స్ ఒక డైలాగ్ ను లీక్ అయ్యేలా చేసారు. అందులో ”ముందు అయితే నీకు షకావత్ కు గొడవ మచ్చా.. కానీ ఇప్పుడు సిండికేట్ కూడా ఇంవోల్వ్ అయ్యింది” అంటూ కేశవ కోసం డైలాగ్ రాసినట్టు ఉంది. దీంతో ఈసారి పుష్పరాజ్ కు షకావత్ కు మధ్య మరింత ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్ సీన్స్ ను పెట్టినట్టు అనిపిస్తుంది.