Divorced Teja-Shobha : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఏడవ వారంలోకి అడుగు పెట్టింది. ఆరు వారాలు సక్సెస్ ఫుల్ గా ముగించుకుని ఏడవ వారం ఫ్రెష్ గా స్టార్ట్ కాగానే సోమవారం నుండే నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి.. సోమవారం, మంగళవారం ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ వారం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. భోలే, అశ్విని శ్రీ, అమర్ దీప్, ప్రియాంక, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, గౌతమ్ లు నామినేట్ అయ్యారు..
ఇక నామినేషన్స్ రచ్చ ముగియడంతో కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఈ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయినట్టు ప్రోమో ద్వారా తెలుస్తుంది.. ఈ ప్రోమోలో రచ్చ స్టార్ట్ అయ్యింది. ఇంటి సభ్యులను రెండు భాగాలుగా విభజించి గులాబీ పురం, జిలేబి పురం అని రెండు గ్రామస్థులకు పాత్రలు ఇచ్చాడు.. ఈ రెండు టీమ్స్ లో ఎవరు ఎలియెన్స్ ను బాగా ఎంటర్టైనర్ చేస్తారో వారు కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు.
గులాబీ పురం సర్పెంచ్ శోభా మాజీ భర్త తేజ.. ఊళ్ళో వాళ్లకు గాసిప్స్ చెప్పే టీ కొట్టు యజమానిగా అమర్ దీప్ ఉన్నాడు. ఇక యావర్ యూఎస్ నుండి పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వస్తాడు. గులాబీ పురం టీమ్ లో పూజా, గౌతమ్ ఉన్నారు.. జిలేబీ పురంలో అర్జున్, అశ్విని, పల్లవి ప్రశాంత్, శివాజీ, సందీప్, భోలే ఉన్నారు.. ఈ రెండు టీమ్స్ ఎంటర్టైన్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేసారు.
విడాకులు తీసుకున్న తేజ, శోభా కొట్టుకున్నారు.. అలాగే అశ్వినిని ఫ్లర్ట్ చేస్తూ అర్జున్ కనిపించగా ఆయన అసిస్టెంట్ గా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఇక శివాజీ ఏకంగా అశ్వినిని తోటకు రమ్మన్నాడు.. ఇవన్నీ ప్రోమోలో కనిపించగా ఆడియెన్స్ లో ఈ రోజు ఎపిసోడ్ పై క్యూరియాసిటీ పెరిగింది. చూడాలి ఈ వారం ఇలాంటి టాస్కుల్లో విజేతలుగా నిలిచి ఎవరు కెప్టెన్ గా నిలుస్తారో..