ఇక, చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో పెట్టి పరిష్కరించలేనంత పెద్దవిగా చేసుకొని విడిపోతున్న వారు లెక్కకు మించి కనిపిస్తున్నారు. కొన్ని అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్ చేసుకుంటే మరికొన్ని కోర్టులో పరిష్కారం అవుతున్నాయి. అందులో చట్టపరంగా చూసుకుంటే భరణం గురించి తెలుసుకుందాం.
భరణం అనేది భార్య, భర్తల మధ్య ఆర్థిక సంబంధాలను మాత్రమే చూపిస్తుంది. భర్తపై భార్య ఆధారపడినప్పుడు భార్యకు, భార్యపై భర్త ఆధారపడినప్పుడు భర్తకు భరణం రూపంలో డబ్బు అందుతుంది. అయితే, దీన్ని ఎలా లెక్కిస్తారు? ఎవరికి ఎలా ఇస్తారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందా.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం భార్య లేదా భర్త వారి మద్దతు, పోషణ కోసం కోర్టు ద్వారా భరణం పొందవచ్చు.
భార్యా, భర్తల్లో ఎవరైనా సంపాదిస్తున్నారా? లేదా వారి వయస్సు, విద్యార్హత, వారి ఆస్తి వంటి వాటిని కోర్టు పరిగణలోని తీసుకొని భరణానికి అర్హులా? కాదా? అని నిర్ణయిస్తుంది.
భర్త వికలాంగుడు అయినా, ఏదైనా శారీరక, మానసిక పరిస్థితులతో సంపాదించలేకపోతే భార్య భరణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
భాగస్వామి ఇద్దరు భార్యలు కలిగి ఉండడం లేదా వ్యభిచారం చేస్తున్నట్లు ధ్రువీకరించినా లేదా ఎటువంటి సహేతుకమైన కారణం లేకుండా భాగస్వామి నుంచి విడిగా ఉండి కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంటే భరణాన్ని కోర్టు ఇప్పిస్తుంది.
భరణం లెక్కించడం ఎలా?
భరణం లెక్కించేందుకు నిర్ధిష్టమైన ప్రమాణాలంటూ ఏమీ లేవు. దీని కోసం సుప్రీం కోర్టు కొన్ని ప్రమాణాలను వివరించింది.
భరణం నెల లెక్కన, కాలానుగుణంగా చెల్లించాలని నిర్ణయిస్తే భాగస్వామి నెలవారీ జీతం నుంచి 25% శాతంను 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం చెల్లించాలి. ఇందులో అతని నికర ఆదాయంలో ఎటువంటి తగ్గింపులు ఉండవు.
వన్ టైమ్ సెటిల్మెంట్ అయితే భాగస్వామి ఆస్తిలో 1/3 నుంచి 1/5 వంతు వరకు చెల్లించాల్సి ఉంటుంది.
భాగస్వామిపై వారి తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నా, ఏవైనా అప్పులు ఉన్నా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అయితే అప్పటికే అతనిపై అనేక బాధ్యతలు ఉంటే భరణం చెల్లించాల్సిన అవసరం ఉండదు.
కొన్ని రాష్ట్రాల్లో వివాహ వ్యవధిని భట్టి కూడా భరణాన్ని లెక్కిస్తారు.
ఒకవేళ వారికి పిల్లలు ఉంటే వారి సంరక్షణకు విద్య, పెంపకం కోసం భరణం చెల్లించాల్సి ఉంటుంది.
ReplyForward
|