Does BJP Promote Family Politics? : వారసత్వ, కుటుంబ పాలన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో దాదాపుగా కనిపించదు. ఎక్కడో ఒకటి, రెండు చోట్ల అది కూడా పార్టీ విలువలమేరకే అంటూ చెప్తున్న బీజేపీలోకి ఫ్యామిలీ పాలిటిక్స్ ఎంటరయ్యాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆ కుటుంబం గురించి దేశం అంటూ గాంధీ కుటుంబం వైపు వేలెత్తి చూపుతూ మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ దీనికి ఒప్పుకుంటారా? అంటూ సందేహమనే చెప్పాలి. కానీ ఇది మాత్రం నమ్మలేదని నిజం.
తెలంగాణలో బీజేపీ పాలిటిక్స్ కొత్త ఒరవడిని తీసుకస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కుటుంబ, వారసత్వానికి దూరంగా ఉన్న పార్టీలో తమ వారసులకు సీట్లు కేటాయించాలని సాక్షాత్తు సీనియర్ నాయకులే కోరుతుండడంతో అధిష్టానానికి మింగుడు పడడం లేదు. వారసులను పార్టీలోకి తీసుకచ్చేందుకు సీనియర్ నాయకులు స్కెచ్ వేస్తుంటే అధిష్టానం వాటికి చెక్ పెడుతూ వస్తుంది. నాయకుడు జితేందర్ రెడ్డి తన తనయుడు మిథున్ రెడ్డి కోసం మహబూబ్ నగర్ టికెట్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే జితేందర్ రెడ్డి షాద్ నగర్ లో పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరికి టికెట్ ఇవ్వడం కుదరదు అనడంతో షాద్ నగర్ ను తన కొడుకుకు ఇవ్వాలని అనుకుంటున్నాడు జితేందర్ రెడ్డి.
ఇక బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ తన కూతురు కోసం గద్వాలను అడుగుతోందని సమాచారం. డీకే అరుణ ఈ సారి నారాయణపేట నుంచి బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నారాయణ పేటను తన కూతురి కోసం బండారు దత్తాత్రేయ కోరినట్లు తెలుస్తుంది. ఇక వేములవాడ టికెట్ ను వికాస్ రావుకు ఇవ్వాలని విద్యాసాగర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇన్ చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్ చార్జి సునీల్ బన్సల్ తో భేటీ కూడా అయ్యారు.
వరుసగా సీనియర్ల నుంచి వస్తున్న వినతుల మేరకు హై కమాండ్ వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని చెప్తున్నట్లు సమాచారం. పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్రత్యర్థి పార్టీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వద్దని చూస్తున్నట్లు సమాచారం. వారసత్వ, కుటుంబ పాలనకు బీజేపీ దూరంగా ఉంటుందని చెప్తూనే మొన్న తెలంగాణ సభలో మోడీ కూడా కేసీఆర్ కేటీఆర్ గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ సీఎం అయ్యేందుకు తాను ఒప్పుకోలేదన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని అధిష్టానం ససేమీరా అంటుుంది. నేతలు ఏం చేస్తారో చూడాలి మరి.