CM Jagan :
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నది. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిశారని ప్రచారం జరిగింది. ఎన్నికలకు వెళ్లే నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును వివిధ కేసుల్లో జైలుకు పంపించారనే టాక్ కూడా వినిపించింది.
అయితే ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న వైసీపీ వై ఏపీ వాంట్ జగన్ అనే కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణులకు సీఎం జగన్ ఒక క్లారిటీ ఇఛ్చారు. ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని తెలిపారు. 2019లో ఏప్రిల్ 11 న ఎన్నికలు జరిగాయి. ఇఫ్పుడు కూడా అదే సమయానికి ఎన్నికలు ఉంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఆరు నెలల సమయమే మిగిలిన నేపథ్యంలో ఆయన శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. పార్టీ కట్టుబాట్లు దాటే వారిపై చర్యలకు కూడా తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులోనే ఎన్నికలకు సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పాటు జగన్ ప్రభుత్వమే ఎందుకు కావాల్ననే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీ నీడ్స్ జగన్ అంటూ చేపట్టే కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.