CM YSJagan : కొందరు చెడు చేయాలని ప్రయత్నించినా.. మంచే జరుగుతుందనడానికి ఇదొక నిదర్శనం. తెలుగు రాష్ర్టాల్లో ప్రభుత్వాలతో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా ఢీ కొడుతున్నది ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక. అయితే ఏపీలో ఈ చానల్ పై జగన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తుందనే కారణంతో దానిని తొక్కి పెట్టారు. ఇక పత్రిక కు యాడ్స్ కూడా ఇవ్వడం లేదు. అయితే ఇక్కడే ఏబీఎన్ కు మంచి జరిగినట్లుగా కనిపిస్తున్నది.
ఏబీఎన్ చానల్ ఇప్పుడు యూ ట్యూబ్ లో జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో కేబుల్ ఛానళ్లలో ఆ ఛానల్ ను రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఎక్కువ మంది యూ ట్యూబ్ లలో ఈ చానల్ ను చూస్తున్నారు. ఇండియా న్యూస్ చానల్స్ రేటింగ్స్ లో ఫోన్లలో యూట్యూబ్ ద్వారా ఎక్కువగా చూస్తున్న చానళ్లలో ఏబీఎన్ ఉంది. జీ న్యూస్, అజ్ తక్, టీవీ 9 మరాఠీ తర్వాత ఏబీఎన్ నాలుగో స్థానంలో ఉంది. కానీ వివేకా కేసు పరిణామాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలు కేవలం ఏబీఎన్ మాత్రమే ప్రసారం చేస్తుందనేది అందరికీ తెలిసిందే. దీంతో యూ ట్యూబ్ ద్వారా ఏబీఎన్ ను చూస్తున్నారు.
అయితే అక్కడ ఏపీలో, ఇక్కడ తెలంగాణలో ఏబీఎన్ కు యాడ్లు నిలిపివేశారు. ఇక ఏపీలో పూర్తిగా బ్యాన్ చేశారు. దీంతో సీఎం జగన్ సాధించిందేమి లేదు. అందుకే ఇంకా ఆయన ఇబ్బందులు పెట్టడంతో పాటు పదే పదే బహిరంగ సభల్లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలను విమర్శిస్తూ ఉంటారు. అయితే దీనిపై ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. సీఎం కూడా ఏబీఎన్ చానల్ చూస్తారని, అందుకే ఆయనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలు తెలుస్తున్నాయని పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా జగన్ తొక్కి పెట్టాలనుకున్నా , ఏబీఎన్ కు మేలే జరిగిందనే అభిప్రాయం వినిపిస్తున్నది.
ఏపీలో టీడీపీకి కొంత అనుకూలంగా కథనాలను ఏబీఎన్ ప్రసారం చేస్తుంటుంది. అయితే తెలంగాణలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా పోరాడుతున్నదనే మంచి అభిప్రాయం మెజార్టీ మేధావుల్ల ఉంది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రసారాలు, కథనాలను బహిరంగంగా సమర్థించుకున్నా, అందరూ ఇదే కరెక్ట్ విధానమని కొనియాడుతున్నారు. జర్నలిజం ఒకరి పక్షాన కాకుండా, ఇలా ప్రజల పక్షాన ఉండాలని చెబుతున్నారు. అయితే టీడీపీ కి ఎక్కువ అనుకూల వార్తలు ఇవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఏదేమైనా ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్లడం గొప్పతనమేనని అభిప్రాయపడుతున్నారు.