Cricketer Ashwin టీమిండియా స్టార్ క్రికెటర్ అశ్విన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మొదటి నుంచి క్రికెట్ అంటే ఇష్టమున్నా చదువును కూడానిర్లక్ష్యం చేయలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాతే క్రికెట్ వైపు ఫోకస్ చేశాడు. దీంతో ప్రస్తుతం టీమిండియాలో ప్రముఖ క్రికెటర్ గా మారాడు. చెన్నైలోని ఎస్ఎస్ఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో టెక్నాలజీ బ్రాంచ్ లో బీటెక్ పూర్తి చేశాడు.
స్కూలు నుంచే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్నాడు. సరైన శిక్షణ తీసుకుని వెనక్కి చూడలేదు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్నాడు. రూ. 5 కోట్లకు ఈ సీజన్ లో ఆడిన అతడు రెండు మ్యాచుల్లో 15 వికెట్లు తీసి అదరగొట్టాడు. టీమిండియా తరఫున స్పిన్నర్ గా ఆడుతూ తనకు ఎదురులేదని చాటుతున్నాడు.
టీమిండియా, ఐపీఎల్ కు ఆడుతూ రూ. కోట్లు కూడబెట్టుకుంటున్నాడు. ఇప్పటికే అతడి వద్ద రూ. వంద కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో 712 వికెట్లు పడగొట్టాడు. టీమిండియాలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ అన్ని కోట్లున్నా ఆటను మాత్రం వదలడం లేదు. ఆటలో ఎప్పుడు కొత్త తరహాలో ఆటను ఆస్వాదిస్తుంటాడు.
టీమిండియాలో తిరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తనదైన శైలిలో రాణిస్తూ జట్టుకు అండగా ఉంటున్నాడు. కోహ్లి, ధోనితో కలిసి ఆట పంచుకుంటున్నాడు. రూ. వందల కోట్లున్నా క్రికెటే తన ప్రాణంగా భావిస్తున్నాడు. చిన్న నాటి నుంచే క్రికెట్ పై ఉన్న మక్కువతోనే ఇష్టంగా ఆడుతుంటాడు. క్రికెట్లో తనకు తానే సాటిగా చేస్తూ వికెట్లు తీయడం అలవాటుగా చేసుకున్నాడు.