Vennela Kishore house : మనదేశంలో రెండు వేల నోట్ల రద్దు వ్యవహారం సంచలన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు ఎవరి దగ్గర రూ. 2 వేల నోట్టు ఉన్నా వాటిని బ్యాంకులో ఇవ్వాలని సూచిస్తోంది. ఇదివరకు రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటు ఇంకా రద్దు చేయాలని చెప్పినా శుక్రవారం మనసు మార్చుకుని రెండు వేల నోట్లు రద్దుకు మొగ్గు చూపింది. దీంతో రూ. 2 వేల నోట్లు ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ వద్ద రూ. 2 వేల నోట్ల గుట్టలుగా పడిఉన్నాయి. దీంతో ప్రముఖ నటుడు మంచు విష్ణు వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం సంచలనం కలిగిస్తోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అన్నా నాకు ఉద్యోగం లేదు. నాకో నోట్ల కట్ట ఇవ్వొచ్చు కదా అని అడుగుతున్నారు.
బడాబాబుల వద్ద ఇంకా రూ.2 వేల నోట్ల కట్టలు ఉన్నట్లు చెబుతున్నారు. బయట పడని కట్టలు ఎన్నో ఉన్నాయి. అందులో వెన్నెల కిషోర్ వి ఎంత అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. చట్టబద్ధమైన డబ్బు ఎంత ఉన్నా అది బ్యాంకులో ఇవ్వకపోతే నిరర్థకమే. దీంతో ఎలా చెలామణి చేసుకోవాలనే దానిపై చాలా మంది ఆలోచనలో పడిపోతున్నారు.
సెప్టెంబర్ 30వ తేదీ లోపు రూ. 2వేల నోట్లు బ్యాంకులో ఇవ్వాల్సిందే. మంచు విష్ణు చేసిన పోస్టింగ్ కు అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని నోట్ల కట్టలను కిషోర్ ఇంట్లో ఉంచుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా 3.62 లక్షల కోట్లు రూ.2 వేల నోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గడువులోగా మార్చుకోవాలి.