Top BJP leaders : ఏపీ పై బీజేపీ అగ్ర నేతలు దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతలకు దీనిపై దిశా నిర్దేశం చేసేందుకు ఈ వారంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ 8న నడ్డా, 10 న అమిత్ షా రాబోతున్నాడు.
తిరుపతిలో జేపీ నడ్డా ఈ నెల 10న శ్రేణులతో సమావేశం కానున్నారు. ఇద్దరు నేతల సమావేశాలపై ఈసారి రాష్ట్రంలో ఆసక్తి పెరిగింది. రాష్ట్రంలో తమ పార్టీ నేతలకు ఈ అగ్ర నేతలు రోడ్డు మ్యాప్ ఇస్తారని అంతా అనుకుంటున్నారు.
ఇప్పటికే జనసేన పార్టీ మాతో ఉందని బీజేపీ చెబుతూ వస్తున్నది. కానీ జనసేన మాత్రం టిడిపికి దగ్గరవుతున్నది. అయితే రెండు పార్టీల అగ్ర నేతలు మాత్రం బీజేపీ అగ్ర నేతలతో టచ్ లో ఉన్నారు. మరోవైపు జగన్ కూడా బిజెపితో అంటకాగుతున్నారు.
అయితే ప్రస్తుతం బీజేపీ నేతలెవరూ అధికార వైసీపీపై విమర్శలు చేయడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది రాష్ట్ర నేతలకు ఇబ్బంది గా మారింది. ప్రజల్లో పార్టీ ఎటువైపు ఉందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
అయితే ఇప్పుడు అగ్రనేతల పర్యటన ద్వారా రాష్ట్ర నేతలకు ఒక రూట్ మ్యాప్ దొరకనుంది. ఎవరితో తమ దోస్తీ ఉంటుందనేది తేలనుంది. చంద్రబాబు వైపా.. జగన్ వైపా బీజేపీ ఉన్నదనేది త్వరలో ప్రజలకు కూడా ఒక అవగాహన రానుంది. అగ్రనేతలు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తారా.. లేదంటే కేవలం తమ పార్టీ వరకే మాట్లాడుతారా అనేది సభలో తేలనుంది.