Purandeshwari : వైజాగ్ లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ తో మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. వై యస్ జగన్ ప్రజలకు ఏం చేశారు చెప్పుకోలేని స్థితిలో నాపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు.
డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజలను ఇలాంటి వ్యాఖ్య లతో మభ్య పెట్టకుండా వారికి మీరేం చేశారో చెప్పండి అని పురందేశ్వరి అన్నారు. ఈ తరహా దుష్ప్రచారాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పురందేశ్వరి అన్నారు. వైసిపి పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని పెండింగ్ ప్రాజెక్టుల ఊసే వైసిపి ప్రభుత్వం ఎట్టలేదని ఆమె విమర్శించారు.
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అభివృ ద్ధి ఎక్కడ జరిగిందో మాకు చూపించాలని ఆమె ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తామని పురందేశ్వరి తెలిపారు.