29.6 C
India
Sunday, April 20, 2025
More

    Mamatha Benerjee : కాంగ్రెస్ పై మమత మెత్తబడిందా..?

    Date:

    • కలిసి నడిచేందుకే ఆ సంకేతాలు
    mamatha benerjee
    mamatha benerjee

    Mamatha Benerjee : ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో మహిళా నేతల్లో ఫైర్ బ్రాండ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేరే. రాజకీయాల్లో తనదైన శైలి లో ముందుకు సాగుతున్నారు. ఒకానొక దశలో కేంద్ర ప్రభుత్వం ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆమె ఫైట్ కొనసాగించారు. ఏకంగా ప్రధానే రంగంలోకి దిగి, మమతను పశ్చిమ బెంగాల్ లో ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఆమె రెండో సారి అధికారంలోకి వచ్చి సవాల్ విసిరారు.  కాంగ్రెస్ తో కొంత కాలం అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

    కాంగ్రెస్ పై మారిన శైలి..

    కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం తర్వాత మమత శైలిలో కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తున్నది. పొత్తులపై ఆమె సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు బలం ఉన్న చోట  తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇందుకు ఆమె ఒక షరతు విధించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధపడాలని కోరారు. యూపీలో సమావాజ్ వాదీ, బెంగాల్ లో తృణమూల్, బిహార్ లో జేడీయూ – ఆర్జేడీ, ఢిల్లీలో ఆప్ బలంగా ఉన్నాయని, ఆయా చోట్ల కాంగ్రెస్ మద్దతునిస్తే పొత్తులపై తాము ముందకెళ్తామని స్పష్టం చేశారు.  అయితే కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేయబోమని, సీట్లు పంపిణీపై మంచి స్నేహపూర్వక నిర్ణయంతో ముందుకెళ్తామని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్తో కూటమికి పలు ప్రాంతీయ పార్టీలు రాయబారం నడుపుతున్న నేపథ్యంలో మమత వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 2024 ఎన్నికలకు ముందు ఇది కాంగ్రెస్ శ్రేణులకు ఇది మంచి శుభవార్తే అని చెప్పుకోవాలి.

    మోదీని ఢీకొట్టాలంటే..
    ప్రధాని మోదీ రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తెచ్చారు. మూడోసారి కూడా ఆయన అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి వేదిక కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో స్వయంగా ప్రధానే అన్నీ తానై నడిపించినా బీజేపీ కోలుకోలేని దెబ్బ తినడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్సే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మమత మాటలు ప్రాధాన్యత సంతరించకున్నాయి. ఇప్పటికే స్టాలిన్,  నితీశ్, తదితర నేతలు కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మమత కూడా మద్దతు చెబతే 2024 ఎన్నికలు హోరాహోరీ తప్పదు.
    బీజేపీ సంక్షేమాన్ని పట్టకుండా, కేవలం మత, కుల, విద్వేష రాజకీయాలకే పరిమితమైందని ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు నిప్పులు కురిపిస్తున్నాయి. ఎదురుతిరిగిన నేతలను సీబీఐ, ఈడీలతో వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. మరోవైపు నిత్యావసర, గ్యాస్, పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరలు అకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుడు బీజేపీ అంటేనే మండిపడే పరిస్థితి వస్తున్నది. బీజేపీకి రానున్న రోజుల కొంత గడ్డుకాలమే. ఇక విపక్షాలు ఐక్యంగా ముందుకెళ్తే ఇక మరింత కష్ట కాలమే.  సో.. 2024 బీజేపీకీ కలిసి వస్తుందో లేదో చూద్దాం..

    Share post:

    More like this
    Related

    Bigg Boss : ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!

    Bigg Boss : ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే హిందీ బిగ్...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...

    JEE Main : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: 24 మందికి 100 పర్సంటైల్

    JEE Main : జేఈఈ (మెయిన్) 2025 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి...

    Infosys : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ : 20వేల కొత్త నియామకాలు..!

    Infosys Jobs : దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2026 ఆర్థిక సంవత్సరంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...

    Revanth Reddy Fires : హద్దు దాటితే గుడ్డలు ఊడదీసి కొడతా.. సోషల్‌ మీడియా పోస్టులపై రేవంత్ రెడ్డి ఫైర్

    Revanth Reddy Fires : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో...

    Congress : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీరో.. గుండు సున్నా కొట్టిన హస్తం పార్టీ

    Delhi Congress : ఢిల్లీలో కాంగ్రెస్‌ వరుసగా మూడోసారి సున్నా స్థానాలకే పరిమితమైంది....