Pawan kalyan మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్లో పవర్ స్టార్ ఒకరు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. మెగా ఫ్యామిలీ నుండి మల్టీస్టారర్ చేస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఆశ పడుతుంటారు.. మరి ఫ్యాన్స్ ఆశలను నిజం చేస్తూ ఇన్నాళ్లకు మెగా మల్టీస్టారర్ తెరకెక్కిన విషయం తెలిసిందే..
పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ”బ్రో”.. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వినోదయ సీతం అనే రీమేక్ సినిమా అనే విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ లతో పాటు ఐటెం సాంగ్ ల స్పెషలిస్ట్ ఊర్వశి రౌటేలా స్టెప్పులేసిన విషయం విదితమే.. దీంతో ఈ భామ కూడా ప్రమోషన్స్ లో కనిపిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా ఆ ఈవెంట్ లో ఊర్వశి పవన్, సాయి తేజ్ లతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ భామ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.
ఈమె ట్వీట్ ‘చేస్తూ.. ‘ఏపీ సీఎం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది” అంటూ చేసిన ట్వీట్ తో ఈమెపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.. కనీస నాలెడ్జ్ కూడా లేదంటూ ఈమెపై ఫైర్ అవుతున్నారు. అయితే బ్రో ఈవెంట్ లో ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ ను సీఎం అని సంబోదించడంతో ఈమె నిజమే అనుకుని ట్వీట్ చేసిందేమో అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.