Heroine Soundarya : సౌందర్య.. ఈమె పేరు చెబితే చాలు ఏ ఇండస్ట్రీ ప్రేక్షకులు అయిన వెంటనే గుర్తు పడతారు.. అంతగా అందరికి ఈ భామ ఫేవరేట్ హీరోయిన్.. ముఖ్యంగా సౌత్ ఇండియాలో సౌందర్య స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.. ఒకప్పుడు సావిత్రి తర్వాత ఈమెనే అత్యంత ఎక్కువుగా ప్రజలు ఆదరించారు అనే చెప్పాలి. సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న సౌందర్య ఇప్పటికీ కోట్లాది మంది ఆరాధించే అందాల తారలలో ఒకరిగా ఉన్నారు.
గ్లామర్ చూపించక పోయిన తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సౌందర్య తెలుగులో కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అంటే అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్ గా అన్ని భాషల్లో పేరు పొందింది. కానీ ఈమె చిన్న వయసులోనే మరణించింది.. 31 ఏళ్లకే విమాన ప్రమాదంలో చనిపోయి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
అయితే ఈమె భౌతికంగా మన మధ్య లేకపోయినా సౌందర్య గురించి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది.. ఇక తాజాగా ఈమె ఆస్తుల గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాదాపు 100కు పైగానే చిత్రాల్లో నటించిన సౌందర్య వేల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకుంది. అయితే ఈమె మరణం తర్వాత ఆస్తి కోసం గొడవలు బాగానే జరిగాయి.
ఆస్తి తనకే కావాలంటూ సౌందర్య భర్త రఘు కాదు ఆమె రాసిన వీలునామా ప్రకారం ఆస్తులు పంచాలని అమర్నాథ్ భార్య నిర్మల, ఆమె కుమారుడు సాత్విక్ కోర్టును ఆశ్రయించారు.. అయితే ఈమె ఎలాంటి వీలునామా రాయలేదని ఆమె సోదరుడు లాయర్ కావడంతో తప్పుడు పత్రాలను సృష్టించారని సౌందర్య తల్లి కోర్టుకు తెలిపారు.. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మొత్తం రాజీకి వచ్చి ఆస్తులను పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.