SHE Teams : నెల రోజుల్లో 224 మంది ఆకతా యిలను పట్టుకున్నామని రాచకొండ షీ టీమ్స్ డి సిపీ ఉషా విశ్వనాధ్ తెలిపారు. బాలికలను, ,మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని డీసీపీ ఉషా విశ్వనాథ్ తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు మరియు బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను ,మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధా రాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు.
రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు, ఐపిఎస్ గారి ఆదేశానుసారం, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఈరోజు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను , యువతులను వేదింపులకు గురిచేస్తున్న 224 మందిని (మేజర్స్-140, మైనర్స్ -84) షీ టీమ్స్ వారు అరెస్టు చేసినారు. వారికి ఎల్బి నగర్ CP Camp office (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు ) నందు భూమిక ఉమెన్స్ కలెక్టివ్ (NGO) వారి ఆధ్వర్యంలో కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
గత నెల డిసెంబర్ పిర్యాదులు అందినాయని, ఉమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ డిసిపి శ్రీమతి టి. ఉషా విశ్వనాథ్ తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన ఫిర్యాదులలో ఫోన్ల ద్వారా వేదించినవి -60 , WhatsApp కాల్స్ & messages ద్వారా వేదించినవి – 120, social media apps ద్వారా వేదించినవి- 60, నేరుగా వేదించినవి – 50. వాటిలో క్రిమినల్ కేసులు-12, పెట్టి కేసులు- 131, మరియు 84 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.