Shubman Gill : ఐపీఎల్ 16 సీజన్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. అయితే ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు కీలక విజయాలు అందించడంలో ఓ బ్యాట్స్ మెన్ కీలకం. అతడే శుభ్ మన్ గిల్. ఏకంగా రూ.. 8కోట్లతో ఆయనను జీటీ యాజమాన్యం కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్గుగానే ఆయన ఆట కొనసాగింది. ఈ ఏడాది 890 పరుగులు చేసి,అందరినీ ఆకట్టుకున్నారు. అయితే శుభ్ మన్ ను ఇప్పుడు అందరూ అభిమానిస్తున్నారు. భవిష్యత్ టీమిండియాకు మంచి క్రికెటర్ దొరికాడని క్రీడా అభిమానులు, ఇండియా అభిమానులు పొంగిపోతున్నారు. ఐపీఎల్ తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను గిల్ సంపాదించుకున్నాడు.
శుభ్ మన్ గిల్ ను అందరూ కోహ్లీతో పోలుస్తున్నారు. మరో వైపు సచిన తో కూడా మరికొందరు పోలుస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం సరికాదని గుజరాత్ టైటాన్స్ మెంటార్ గ్యారి కిరిస్టెన్ అన్నారు. గిల్ కేవలం యంగ్ ప్లేయర్. ఆయన ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. అదే పట్టుదలతో కూడా గిల్ ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో గిల్ ఇంకా తన గేమింగ్ చూపాల్సి ఉంది, అయితే గిల్ వంటి బ్యాట్స్ మెన్ దొరకడం చాలా కష్టం. గత కొంత కాలంగా తన ఆటతీరును ఎంతో మెరుగుపర్చుకున్నాడు. అయితే ఇంకా కొంత కాలం ఇది కొనసాగించాల్సి ఉంది. ఇప్పుడే దిగ్గజాలైన కోహ్లీ, సచిన్ తో పోల్చడం సరికాదు. అయినా దానికి గిల్ పొంగిపోవడం లేదని మెంటార్ చెప్పారు. మరి భవిష్యత్లో ఈ బ్యాటింగ్ స్ర్టెంత్ ను గిల్ కొనసాగిస్తాడా లేదా వేచిచూడాలి.