Jagan Welfare : ఏపీలో అధికారం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. జగన్ లక్ష్యంగా టీడీపీ – జనసేన పొత్తుకు దిగాయి. సీఎం జగన్ కూడా వై నాట్ 175 నినాదంతో ఇప్పటికే కదనరంగంలోకి దిగారు. ఈ 54 నెలల కాలంలో అందించిన సంక్షేమమే తనకు మరోసారి అధికారం ఇస్తుందని జగన్ భరోసాతో ఉన్నారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల్లో 1.40 కోట్ల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం చేరువ అయ్యింది. ఆ ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకునేందుకు వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో గడప గపడకు వైసీపీ శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి.
వై ఏపీ నీడ్స్ జగన్: వైసీపీ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పేరిట ప్రజల్లోకి వెళ్తున్నది. డిసెంబర్ 19 వరకూ గ్రామగ్రామాన కార్యక్రమం కొనసాగనుంది. గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహించనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కల్పించిన మేలుపై ‘ప్రజాతీర్పు’ సర్వేతో కార్యక్రమాలు చేపడుతున్నారు. సచివాలయాల వద్ద రియల్ డెవలప్మెంట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మ్యానిఫెస్టో అంశాల్లో దాదాపు 99.5 శాతం పూర్తి చేసిన సీఎం జగన్ భవిష్యత్తు ఎన్నికలకూ మ్యానిఫెస్టో పైన ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.రాష్ట్రంలో 1 .60 కోట్ల కుటుంబాల్లో దాదాపు 1.40 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సంక్షేమ ఫలాలు అందాయి.
మేలు జరిగితేనే?
తమ కుటుంబాలకు మేలు జరిగిందని నమ్మితేనే తనకు మద్దతు ఇవ్వాలని జగన్ పదే పదే కోరుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో కుటుంబాలకు వివిధ రూపాల్లో ఆర్థిక వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలోని మెజార్టీ వర్గాలైన పేద, బడుగు బలహీనవర్గాలను నిర్ణయాత్మక శక్తిగా మారడంతో ఎన్నికల్లో తిరిగి అధికారం పై వైసీపీలో ధీమాకు కారణంగా చెప్పవచ్చు. సీఎం జగన్ ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పని చేస్తున్న టీడీపీ విడుదల చేసిన సంక్షేమానికి ప్రజల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అదిరిపోయే సంక్షేమం అంటూ చేసిన ప్రచారానికి గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారు. అయితే, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే విశ్వసనీయత జగన్ సొంతం కావడంతో ఎన్నికల వేళ అదే బ్రహ్మాస్త్రంగా మారుతోంది.
ప్రజల్లోకి పార్టీ నేతలు..
ఇదే సమయంలో అభివృద్ధి విషయంలోనూ ఈ క్యాంపెయిన్ లో పార్టీ నేతలు వివరించనున్నారు. జీఎస్డీపీ లో.. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయిన నాటికి 22వ స్థానం ఉంటే.. 2021-22 లో ఏపీ నంబర్ వన్ స్థానానికి చేరింది. తలసరి ఆదాయంలోకొస్తే 2019 నాటికి 17వ స్థానంలో ఉంటే ప్రస్తుతం అది 9 వ స్థానానికి వచ్చింది. చంద్రబాబు హయాంలో కేవలం 34వేల పోస్టుల్ని భర్తీ చేయగలిగితే.. అదే జగన్ అధికారం లోకి వచ్చాక ఆర్టీసీ విలీనంతో కలిపితే రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 4.93 లక్షలు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగాల వివరాల్ని తీసుకుంటే 2 లక్షల 13వేల 662 మందికి అవకాశం దక్కింది. దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలు నేరుగా సచివాలయ వ్యవస్థ ద్వారా… వైద్యరంగంలో దాదాపు 50వేల మందికి శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో వివరించనున్నారు.