Kavya Kalyan Ram Fire గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన కావ్యా కళ్యాణ్ రామ్ తర్వాత హీరోయిన్ గా ఒక్క సినిమాతో పాపులర్ అయ్యారు. గంగోత్రిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఈ బ్యూటీ. ‘బలగం’లో ప్రియదర్శికి జంటగా నటించి మెప్పించింది. ఈ ఒక్క చిత్రంతో ఆమె క్రేజ్ గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా వ్యాపించింది. చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్రామ్ కథానాయికగా మారి విమర్శకుల ప్రశంసలు పొందిన లైఫ్ విలేజ్ డ్రామా ‘బలగం’తో బాగా ఫేమ్ లభించింది. ఈ మూవీ ఆమెకు మరిన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించేందుకు ఒక దారి పరిచిందని చెప్పవచ్చు.
ఇదిలావుండగా, కావ్య ఇటీవల తన దర్శకులతో బాడీ షేమ్కు గురైందని సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వార్తలను మాత్రం ఆమె కొట్టిపారేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఆమె పేర్కొంది. ‘దర్శకులు నన్ను బాడీ షేమ్కు గురిచేసినట్లు కొన్ని మీడియా సంస్థలు అకస్మాత్తుగా వార్తలను ప్రచురించాయి. ఇవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది. అసత్యమైన ప్రకటనలను ప్రచారం చేస్తున్నాయని గమనించాను, నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ పేర్కొంది.
అయితే, హీరోయిన్లకు ఇవన్నీ కామన్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ రాను రాను మరిన్ని గాసిప్ లను ఎదుర్కోక తప్పదని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనా బలగంతో ఆమె నటన గ్రామంలోని సాధారణ ప్రేక్షకుడి వరకు చేరింది. ప్రస్తుతం ఆమె ‘శ్రీ సింహా ఉస్తాద్’లో కనిపించనుంది.
*పోస్ట్ లో కావ్య ఏం చెప్పందంటే*
‘అకస్మాత్తుగా కొన్ని ప్రధాన మీడియా సంస్థలు నన్ను దర్శకులు బాడీ షేమ్గా మార్చినట్లు అసంబద్ధమైన మరియు అసత్యమైన ప్రకటనలను ప్రచారం చేస్తున్నాయని నేను గమనించాను, ఇది నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు’
— KavyaKalyanram (@KavyaKalyanram) జూలై 12, 2023