Keshineni Nani : నూజివీడులో సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఖైదీలను తిరువూరు టిడిపి ఇన్చార్జ్ శావల దేవధత్ పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం తిరువూరు మున్సిపాలిటీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గొడవ జరిగి ఎస్ఐకి గాయమైంది. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. త్వరలోనే వారికి బెయిలు తేవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గొడవలు జరిగిన నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై తీసుకునే ఏ విధమైన చర్యలు కైనా మేము సిద్ధంగా ఉన్నామని టిడిపి ఇన్చార్జ్ దేవదత్ తెలిపారు.
నూజివీడు సబ్ జైలు కి వచ్చిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని
నాలుగు రోజుల క్రితం తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గొడవలో పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో నూజివీడు సబ్ జైల్లో ఉన్న తన అనుచరులు ముగ్గురిని పరామర్శించడానికి ఎంపీ కేశినేని నాని అక్కడికి వచ్చారు.