Keshineni Nani : ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి కేశినేని నాని రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలు స్తోంది. తనతోపాటు మరో 5 అసెంబ్లీ సీట్ల కావాలని వైసిపి అధిష్టానానికి కోరినట్లు సమా చారం అందుతుంది.విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు,విజయవాడ పశ్చిమ నుండి ఎమ్మెస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం,తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు లకు కూడా సీట్లు ఇవ్వమని అడిగినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వైసిపి అధిష్టానం మాత్రం ఇంత మందికి సీట్లు ఇవ్వడం కుదరదని కేశినేని కి ఎంపి పదవితోపా టు మారో రెండు సీట్లు మాత్రమే ఇస్తామని వైసిపి పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది.
విజయవాడ ఎంపీ టికెట్ మళ్లీ ఇవ్వమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో కేశినేని నాని టిడిపికి రాజీనామా చేసి భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తారని ఇప్పటికే స్పష్టం చేశారు. అందులో భాగంగానే తన కూతురుతో ఇప్పటికే రాజీనామా చేయించారు. ఇద్దరు రాజీనామాలు తరువాత వైసిపి లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ దిశగా వారు పావులు కదుపుతున్నట్టు తాజాగా సమాచారం అందుతుంది. వైసిపి పెద్దలతో టికెట్ల విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతుందని తెలుస్తోంది. తనతో పాటు మరో ఐదు మందికి టికెట్లు ఇవ్వాలని కేసినేని నాని వైసిపి అధిష్టా నాన్ని కోరినట్లు తెలుస్తోంది. మొత్తం మీద నాని టిడిపి నుంచి వైసీపీలోకి చేరడం ఖాయమని తెలుస్తోంది.