టాలీవుడ్ లో నాగ చైతన్య, సమంత జంట అంటే ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు కలిసి ఉన్న నాలుగేళ్లు కూడా ఎంతో అన్యోన్యంగా జీవించారు. మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది.. కారణాలు తెలియక పోయిన ఇప్పటికి కూడా ఈ జంట కలిస్తే బాగుండు అని అనుకోని వారు లేరు..
వీరు విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతున్న ఇప్పటికి ఏదొక వార్త వస్తూనే ఉంటుంది. డిబేట్ల మీద డిబేట్స్ పెట్టి మరీ వీరి విడాకుల మీద చర్చ చేస్తారు.. కొంతమంది సామ్ ను సపోర్ట్ చేస్తే మరి కొంతమంది చైతూను సపోర్ట్ చేసారు. ఇక తాజాగా స్వయంగా నాగ చైతన్య విడాకుల మీద స్పదించడం హాట్ టాపిక్ అవుతుంది.
నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది.. దీంతో ఈయన వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ విడాకుల గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా చైతూ సామ్ మీద చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి. ఈయన విడాకుల తర్వాత కూడా సామ్ మీద ఎలాంటి కోపం ప్రదర్శించకుండా పోసిటివ్ కామెంట్స్ చేయడం అందరికి నచ్చుతుంది..
తాజాగా యాంకర్ మీతో కలిసి నటించిన హీరోయిన్లలో మీకు ఏమేమి ఇష్టం అని అడుగగా.. చైతూ మాట్లాడుతూ.. కృతి సిటీలో ఇన్నోసెన్స్ నచ్చుతుంది అని.. పూజా హెగ్డేలో స్టైల్ నచుతుంది అని.. సమంతలో హార్డ్ వర్కింగ్ నచుతుంది.. సమంతను అందుకే పెండ్లి చేసుకున్నా అని చెప్పడంతో ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇక చైతూ వరుసగా రెండు ప్లాప్స్ అందుకున్న నేపథ్యంలో కస్టడీ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. చూడాలి ఇదైనా హిట్ ఇస్తుందో లేదో..!