Mahesh Babu Namrta shirodkar : ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ జీవీకే రెడ్డి మనుమరాలైనShriya Bhupal’s Baby భూపాల్ బేబీ షవర్ పార్టీపై ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పార్టీకి మహేశ్ బాబు కుటుంబంతో కలిసి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థం జరిగి పెళ్లి క్యాన్సిల్ అయిన శ్రేయా భూపాల్. ఆ తర్వాత ఎన్ఆర్ఐ, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ మనుమడితో వివాహం జరిగింది. రీసెంట్ గా బేబీ షవర్ పార్టీని ఈ జంట గ్రాండ్ గా నిర్వహించారు.
బీవీకే రెడ్డి కూతురు షాలినీ భూపాల్ కాగా ఆమె కూతురు శ్రీయా భూపాల్. 1993లో హైదరాబాద్ లోనే పుట్టింది ఈమె. ఫ్యాషన్ ప్రపంచంపై మక్కువ ఎక్కువగా ఉండడంతో న్యూయార్క్ లోని ఫ్యాషన్ స్కూల్ లో చదువుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి క్యాస్టూమ్ డిజైనర్ గా అడగుపెట్టింది. స్టార్ హీరోయిన్లు శ్రేయా శరణ్, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారికి పని చేసింది. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్స్ ఆలియా భట్, మనూషి చిల్లార్, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్ తో పాటు మరింత మందికి పని చేసింది. శ్రీయా భూపాల్ డిజైనింగ్ పేరు ‘శ్రేయా సమ్’ ఇది బంజారా హిల్స్, హైదరాబాద్ లో ఉంది.
అక్కినేని అఖిల్ తో శ్రీయా భూపాల్ డిసెంబర్ 2016లో నిశ్చితార్థం జరుపుకుంది. వీరి పెళ్లిపై నాగార్జున విముఖత చూపడంతో అది పెళ్లి వరకూ వెళ్లకుండా ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె 2018లో ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనుమడు అనిదిత్ రెడ్డిని 6 జూలై, 2018లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎదుట వివాహం చేసుకుంది.
రీసెంట్ గా శ్రీయా భూపాల్ బేబీ షవర్ పార్టీ నిర్వహించింది. దీనికి చీఫ్ గెస్ట్ గా మహేశ్ బాబు ను ఇన్వైట్ చేసింది. కార్యక్రమానికి మహేశ్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కలిసి వచ్చారు. వీరు సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా ఇప్పుడవి వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడతున్నారు.