Warangal : మొక్కజొన్న చొప్పను కాల్చుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని రైతు మృతి చెందాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాపయ్యపేట గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు (65) తన వ్యవసాయ బావి వద్ద మొక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టాడు. అనుకోకుండా మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు వ్యాపించాయి. దీంతో మటలను ఆర్పేందుకు వెళ్లిన పాపారావు ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక సజీవ దహనమయ్యాడు.
బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. పాపారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.