ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జులైలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న 23వ తానా మహాసభలకు రావాలని ప్రముఖ విద్యావేత్త, విజ్ణాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్యను ఆహ్వానించారు. మహాసభల కమిటీ కన్వీనర్ పొద్దుటూరు రవి ఆధ్వర్యంలో కమిటీ బుధవారం కలిసి ఆహ్వానించింది. తాను కూడా మహాసభలకు హాజరు కానున్నట్లు తెలిపారు.
ఈ కమిటీ పలువురు రాజకీయ నేతలను కూడా ఆహ్వానించింది. ఇందులో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ను కూడా తానా సభలకు రావాలని స్వాగతం పలికింది. తానా సభలకు రావాలని ఇంకా పలువురు నేతలను కలిశారు. అందరు తరలివచ్చి సభలను విజయవంతం చేయాలని చెబుతున్నారు.
మూడు రోజుల పాటు జరిగే సభలకు తరలి రావాలని కోరుతున్నారు. తానా సభలను విజయవంతంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే అందరిని పిలుస్తున్నారు. మరిన్ని నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి తానా సభలను జయప్రదం చేసేందుకు ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ సారి చాలా మంది వచ్చేయనున్నారు.
తానా జ్యూరీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించనున్నారు. గణితం, చిత్రలేఖనం, సైన్స్, తెలుగు వంటి వాటిల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నారు. దీంతో తానా సభలకు తగిన విధంగా ప్రచారం నిర్వహించి వాటి గురించి అందరికి తెలిసేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తానా మహాసభల ప్రచారం హోరెత్తనుంది.