Mega Hero’s Comments :
తెలుగు రాష్ర్టాల్లో మెగా కుటుంబ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా వారు గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇవి గతంలో చేసినవే అయినా రెండు, మూడు రోజులుగా విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. ఇందులో ఒకటి రాంచరణ్ పోస్టు చేసింది కాగా, మరొకటి పవన్ స్వయంగా మాట్లాడిన వీడియో.
ఇక ఇండియా ను భారత్ గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. దీనికి ఊతమిస్తూ ఇటీవల రాష్ర్టపతి భవన్ నుంచి వెలువడిన ఒక ఆహ్వాన పత్రికలో గవర్నమెంట్ ఆఫ్ భారత్ ఉండడం కేంద్రం చర్యలను తెలియజేసింది. అయితే గతంలో నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓమూవీ ఫంక్షణ్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇండియా అనేది మనం అరువు తెచ్చుకున్న పదమని, మనం భారత్ అని మాత్రమే అనాలని ఆయన అందులో పేర్కొన్నారు. భారత్ అని ఉంటేనే మన దేశానికి బాగుంటుందని ఆయన అందులో మాట్లాడారు. ఇప్పుడు కేంద్రం ఇదే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన అభిమానులు ఇదే వీడియోను మళ్లీ పోస్టు చేస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ సూచనలను కేంద్రం ఆలకించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ రెండు కీలక అంశాల్లో మెగా హీరోలు మాత్రం ఇప్పుడు మరింత అభిమానాన్ని మూటగట్టుకున్నారు.
ఇటీవల తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదస్పదమయ్యాయి. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు, వివిధ పార్టీలు దీనిని ఖండించాయి. నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా గతంలో రాంచరణ్ చేసిన ఒక పోస్టు తాజాగా వైరల్ అవుతున్నది. తెలుగు రాష్ర్టాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ పోస్టులో రాంచరణ్, తన తల్లి తులసి మొక్క దగ్గర పూజ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలనే పోస్టును అందరూ వైరల్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నది.