PM Modi : ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన కొన్ని గంటలకే మహిళ లకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా దినో త్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్పై రూ. 100 తగ్గిస్తున్నట్లు పీఎం మోదీ ట్విటర్ వేదికగా ప్రకటించారు..
ఇవాళ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.100 తగ్గిస్తామని ప్రధాన మంత్రి తెలిపారు. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ ట్వీట్లో తెలిపారు.
ఎల్పీజీ సిలిండర్పై ప్రభుత్వం ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడగిస్తున్న ట్టు నిన్న కేంద్రం తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకం కింద 14.2 కిలోల ఎల్పీ జీ సిలిండర్పై రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే మ హిళా దినోత్సవం రోజు సిలిండర్ పై 100 రూపా యలను తగ్గిస్తూ మోడీ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Today, on Women’s Day, our Government has decided to reduce LPG cylinder prices by Rs. 100. This will significantly ease the financial burden on millions of households across the country, especially benefiting our Nari Shakti.
By making cooking gas more affordable, we also aim…
— Narendra Modi (@narendramodi) March 8, 2024