No Relief Chandrababu : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మంగళవారం కూడా ఊరట దక్కలేదు. హైకోర్టుతో పాటు ఏసీబీ కోర్టులో ఈ రోజు ఆయన పిటిషన్లపై విచారణ ముందుకు సాగలేదు. దీంతో మరోసారి ఆయన వేచి ఉండక తప్పలేదు. ఇక సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు మధ్యాహ్నం విచారణ జరగనుంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ కూడా మరోసారి విచారణ ప్రారంభమైంది. ఇరువర్గాల లాయర్లు వాదనలు వినిపించారు. అయితే దీనిపై విచారణ ను హైకోర్టు ధర్మాసనం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది, దీంతో సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని తెలుస్తోంది.
మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు నిన్న ఆయన హెల్త్ ఆప్ డేట్స్ ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ వాదనలు ప్రారంభించింది. అయితే ఇందులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇక చంద్రబాబు హెల్తా అప్ డేట్స్ విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈరోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టు లో ఈ రోజు వచ్చే తీర్పుపైనే అంతా చర్చ నెలకొని ఉంది.