Rashmika : టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన దూకుడు మీదుంది. సినిమాల్లో తనదైన శైలిలో నటిస్తూ అగ్ర హీరో యిన్ గా స్థానం దక్కించుకుంటోంది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఆనందం పంచుతోంది. ఇటు టాలీవుడ్ లో నటిస్తూనే బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ చూపిస్తోంది. యానిమల్ సినిమాలో రణభీర్ కపూర్ కు జోడిగా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా నడుస్తోంది. ఇందులో రష్మిక పాత్ర షూటింగ్ పార్ట్ మాత్రం పూర్తయింది.
యాభై రోజుల పాటు చేసిన షూటింగ్ తో రష్మిక పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యాయి. నిన్న సినిమాకు టాటా చెప్పేసి హైదరాబాద్ చేరుకుంది. అక్కడ వారితో చేసిన అనుభవాలు పంచుకుంది. వారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ చిత్రాన్ని టి సిరీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రం యూనిట్ తో రష్మిక సరదాగా గడిపింది. వారితో దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. యానిమల్ షూటింగ్ లాస్ట్ డే కంప్లీట్ అయిందని రష్మిక అందులో రాసుకుంది. ఇలా యానిమల్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో రష్మిక హైదరాబాద్ లో పుష్ప 2లో నటించేందుకు సిద్ధమైంది.
పుష్ప 2లో రష్మికకు సంబంధించిన కీలక సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. వాటిని సైతం త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ సినిమాను శరవేగంగా పూర్తి చేయడానిక సన్నాహాలు చేస్తున్నాడు. ఇక తెలుగులో కూడా వరుస చిత్రాలు చేసి తెలుగు వారి గుండెల్లో చిరస్థానం కల్పించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తోంది.