Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు ‘పుష్ప’ టీమ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిందనే చెప్పవచ్చు. సినిమాలోని ఫస్ట సింగిల్ లిరికల్ ప్రోమోను రేపు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు.
గతంలో రిలీజ్ అయిన పుష్ప సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇప్పుడు పుష్ప-2 ను మరింత జాగ్రత్తగా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తుందని.. సమంత గెస్ట్ అప్పీయరెన్స్ ఉందని ప్రచారంలో ఉంది.