Renu Desai Shocking post : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పై ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేసిన ఆమె తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొంది. ఆ తర్వాత తను ఆ వీడియో ఎందుకు చేశానో అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్, వదినమ్మ మరుదులు షాక్ కు గురయ్యారు.
బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ ను ప్రేమించిన రేణు దేశాయ్ ఆ తర్వాత ఆయనతో అకీరాకు జన్మనిచ్చింది. వెంటనే తేరుకొని వివాహం చేసుకొని ఆ తర్వాత ఆద్యను కన్నది. ఇక మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను వదినమ్మ అనే పిలుస్తుంటారు. చాలా గ్యాప్ తీసుకున్న ఆమె ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఇక గత వీడియో సంగతి చెప్పక్కర్లేదు.
ఇప్పుడు తాజాగా ఆమె తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. తనకు ఇష్టమైన దర్శకుడితో ఫొటో దిగినట్లు తెలిపింది. 3 రోజుల క్రితం అమెరికాలో నిర్వహించిన బాహుబలి కాన్సర్ట్ లో రేణు దేశాయ్ పాల్గొంది. ఆ సమయంలో దర్శకధీరుడు రాజమౌళి, బాహుబలి గురించి చాలా గొప్పగా చెప్పింది. ఆ తర్వాత అదే కన్సర్ట్ లో ఆమె దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కూడా కలిసినట్లు చెప్పింది.
దర్శకేంద్రుడు రాఘవేందర్ రావును కలవడం, ఆయనతో ఫొటో దిగడం చాలా ఆనందంగా ఉందని, ఫుల్ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పుకచ్చింది. ఆ ఫొటోలను తన కొడుకు అకీరానే తీసినట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం రేణు దేశాయ్.. ‘టైగర్ నాగేశ్వరరావు’తో రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ఆమెకు ఎలాంటి టాక్ ను తెస్తుందో చూడాలి మరి.
View this post on Instagram