CSK CEO : కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మధ్య విభేదాలు తలెత్తాయన్న పుకార్లను చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ కొట్టిపడేశారు. గతేడాది నుంచి ఐపీఎల్లో జరుగుతున్న చర్చల్లో ధోనీ, జడేజా గొడవ కూడా ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా 2022 సీజన్ ఆరంభానికి ముందే జడేజాను ప్రకటించారు. కానీ అతని కెప్టెన్సీలో జట్టు రాణించలేదు. దీంతో మరోసారి కెప్టెన్సీ బాధ్యతను ధోనీ తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు పుకార్లు షికారు చేశారు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో జడేజా బ్లైండర్ ఆఫ్ నాక్ ఆడడంతో చెన్నైకి చెందిన ఫ్రాంచైజీ ఐదో ఐపీఎల్ విజయాన్ని సాధించింది. టోర్నీ సమయంలో జట్టులో విభేదాలకు తావులేకుండా ధోని టీమ్ ను ముందుండి నడిపించాడు. సీజన్ మధ్యలో, ధోనీతో జడేజాకు విభేదాలు ఉన్నాయని వచ్చిన పుకార్లు, ట్విటర్లో కొన్ని రహస్య పోస్ట్లను పోస్ట్ చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.
అయితే,సీఎస్కే సఈవో ఇప్పుడు అన్ని పుకార్లను కొట్టివేసారు. జడేజా ఎంఎస్ కంటే ఎక్కువగా బ్యాటింగ్ చేసినప్పుడు ప్రేక్షకులు ‘మాకు ధోనీ కావాలి’ అని నిరంతరం నినాదాలు చేయడం వల్ల జడేజా కొంచెం ఇబ్బంది పడి ఉండవచ్చు, కానీ అతను కెప్టెన్తో ఎప్పుడూ శత్రుభావం లేదు. అని పేర్కొన్నాడు.
జడేజా విషయానికి వస్తే, అతను అద్భుతంగా బౌలింగ్ చేసాడు” అని విశ్వనాథన్ చెప్పాడు.