బైక్ యాక్సిడెంట్ తో సాయి ధరమ్ తేజ్ ఏడాదిన్నర పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తిరిగి ఎంట్రీ ఇచ్చిన వెంటనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. మిస్ట్రీరియస్ థ్రిల్లర్ గా తీసిన ‘విరూపాక్ష తన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని అంటున్న ఆయన కలెక్షన్లను చూసి గంతేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ ముందు మూవీ రిపబ్లిక్ అంతగా కలిసి రాలేదు. నష్టాల్లో కూరుకుపోకున్నా అనుకున్నంత టాక్ మాత్రం రాలేదు. ఇక ఆ తర్వాత ఆయనకు బైక్ యాక్సిడెంట్ అయింది. కాలు ఫ్యాక్చర్ కావడంతో కొన్ని నెలలు షూటింగ్ లకు వెళ్లకుండా రెస్ట్ తీసుకున్నారు.
తర్వాత కార్తీక్ దండు తనకు విరూపాక్ష స్క్రిప్ట్ చెప్పడంతో ఓకే చెప్పారు. తర్వాత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రీ రిలీజ్ నుంచే బ్లాక్ బస్టర్ అంటూ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. మొదటి రోజే విపరీతమైన వసూలు రాబట్టింది.
ట్విటర్ వేదికగా సాయిధరమ్ తేజ్ #AskSDT అనే నేమ్ తో అభిమానులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మీ క్రష్ ఎవరని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఇంకెవరు సమంత అంటూ చెప్పి ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం ఉన్న వారిలో మీకు నచ్చిన హీరో అన్న ప్రశ్నకు యంగ్ తరం హీరోలైన మాస్ మహరాజ్ రవితేజ, రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ సమాధానం చెప్పాడు. మెగా కుటుంబం నుంచి ఎవరి పేరు ప్రస్తావించలేదు. ప్రభాస్, రవితేజ ఫ్యాన్స్ సంబరంలో ఉన్నారు.