29.3 C
India
Tuesday, February 10, 2026
More

    UP CM Yogi : మాతృభూమికి సేవ చేయండి..యూపీ సీఎం యోగి కొత్త స్కీం!

    Date:

    UP CM Yogi
    UP CM Yogi

    UP CM Yogi : విదేశాల్లో ఉంటున్న భారతీయులు మాతృభూమికి సేవ చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు.ఈ మేరకు మాతృభూమి పథకాన్ని ప్రారంభించారు. దీని కింద, విదేశాల్లో స్థిరపడిన UP ప్రజలు వారి స్వగ్రామాల్లో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థికంగా సహకరించడానికి అనుమతి ఇస్తారు.

    ఈ పథకం కింద, ప్రభుత్వం ప్రాజెక్టులో 40% ఆర్థిక సాయం అందిస్తుంది. భూమిని కూడా ఇస్తుంది. మిగిలినది NRIలు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ఎన్‌ఆర్‌ఐలను తమ మూలాలతో అనుసంధానం చేసేందుకు ఇది తోడ్పడుంది. మాతృభూమి పథకం ప్రస్తుతం యూపీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నామని, త్వరలో పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామనని సీఎ తెలిపారు.

    స్వర్గం కంటే తల్లి, మాతృభూమి గొప్పవని, వాటి మధ్య పోలిక ఉండదని, అందుకే ప్రతి ఒక్కరికీ మాతృభూమి పథకంలో భాగస్వామ్యం కల్పించాలని, ఈ పథకం రెండు ప్రయోజనాలను అందజేస్తుందని, వారిని వారి మూలాలకు అనుసంధానం చేస్తుందని  యోగి వెల్లడించారు. వారి మాతృభూమి కోసం సహకరించేందుకు ముందుకు రావాలని కోరారు.

    దుర్వనియోగం కానివ్వం

    ప్రభుత్వానికి పంపితే తమ సొమ్ము దుర్వినియోగం అవుతుందేమోనన్న భయాందోళనలకు లోనవుతున్నారని, డబ్బులు జమ చేసిన వారికే ఖర్చుల ఖాతా ఇచ్చేలా యంత్రాంగాన్ని రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖకు సూచించారు.

    పంచాయతీలను స్మార్ట్‌గా మార్చేందుకు కృషి

    పంచాయతీలను స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని సీఎం తెలిపారు. గ్రామ సచివాలయం, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, పారిశుద్ధ్య సౌకర్యాలు, LED వీధి దీపాలు, మంచి రోడ్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరాలు ఉన్నాయి.

     కాలిఫోర్నియా నివాసి వివేక్ చౌదరి సీఎంతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. గతంలో టాలీవుడ్ లో మహేశ్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా అప్పట్లో సంచలనం రేపింది. రాష్ట్రంలోని చిన్న చిన్న పల్లెలు, పట్టణాల నుంచి నగరాలకు, విదేశాలకు వెళ్లి స్ధిరపడిన శ్రీమంతులు తాము పుట్టిన గడ్డకు తిరిగొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావడం అనేది ఈ సినిమా కాన్సెప్ట్. సరిగ్గా ఇప్పుడు ఇదే కాన్పెప్ట్ ను యూపీలో అమలు చేసేందుకు అక్కడి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక పథకం ప్రారంభించింది

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Peramshetty : మానవీయ విలువలు చాటిన డాక్టర్ పేరంశెట్టిపై కాల్పులు.. మృతి

    Dr. Peramshetty Ramesh Babu : అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు...

    Indian Students: విద్యార్థులు భారత్ ను ఎందుకు వీడుతున్నారు? గణాంకాలు ఏం చెప్తున్నాయంటే?

    Indian Students: దేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయికి...

    Indian Jail In US : తోటి ప్రయాణికురాలిపై లైంగికదాడి.. అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష

    Indian Jail In US: సియాటెల్ వెళ్లే విమానంలో ప్రయాణికురాలిపై లైంగికదాడికి...

    NRI’s Alert: ఎన్ఆర్ఐల అలర్ట్: ట్యాక్స్ క్లియరెన్స్ తప్పనిసరి!

    NRI's Alert: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 230 ప్రకారం.. మీరు...