Rohit Sena : ఐసీసీ వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ వన్ లో నిలిచింది. అయితే ఇప్పటివరకు టీమిండియా ఆస్ర్టేలియా, పాకిస్థాన్, అప్గానిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను ఓడించింది. టైటిల్ రేసులో హాట్ ఫేవరేట్ గా కొనసాగుతన్నది.
అయితే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులోకి తర్వాత ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో రావడం కష్టంగానే కనిపిస్తున్నది. పాండ్యా జట్టులో లేని లోటు మాత్రం కనిపిస్తున్నది. అయితే జట్టు సెమీస్ కు చేరడం ఖాయమైన నేపథ్యంలో తరువాతి మ్యాచుల్లో పాండ్యాను కాకుండా ఇతర ఆటగాళ్లతోనే ఆడించాలని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడే పాండ్యా రావడానికి సిద్ధంగా ఉన్నా, కొంత రెస్ట్ తో పాటు ప్రాక్టీస్ చేయించాలని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు ఇంజెక్షన్లు అవసరం లేకుండా నేరుగా మరికొన్ని మ్యాచులకు రెస్ట్ కల్పించి, కేవలం ప్రాక్టీస్ ద్వారా ఫిట్ నెస్ కాపాడాలని చూస్తున్నట్లు సమాచారం.
ఇంగ్లాండ్ తో మ్యాచుతో కాకుండా లీగ్ లో ఆఖరి మ్యాచ్ కు పాండ్యా ఎంట్రీ ఉంటుందని తెలుస్తున్నది. అంటే నెదర్లాండ్స్ తో మ్యాచుకు పాండ్యాను బరిలో దింపి, సెమీస్, ఫైనల్ ఆడించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పాండ్యా ఫిట్ నెస్ కోసం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలుస్తున్నది. ఇక కివీస్ తో ఆడిన జట్టే ఇంగ్లాండ్ తో మ్యాచులో బరిలోకి దిగే చాన్స్ ఉంది.