IT Attacks Shock To Congress : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతల బిజీగా ఉన్నారు. ఎలాగైనా గెలిచి అధికార పీఠమెక్కాలని తహతహలాడుతన్నాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సీఎం కేసీఆర్ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకం రేపుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న నేత ఇండ్లు.. కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేఎల్ఆర్ నివాసంతో పాటుగా ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలాపూర్ గణేశ్ అడ్డూను దక్కించుకున్న వగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అదే నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల ఇండ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అయితే రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టబడులు పెట్టారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచారు. అదేవిధంగా బాలాపూర్ లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ అశావహులు, బడంగ్సట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి తిరుపతిలో, ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. పారిజాత నర్సింహారెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కోట్లలో డబ్బులు ముట్టజెప్పారని ఆరోపించారు.
ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో ఐటీ దాడులు కొత్త టెన్షన్ కు కారణం అవుతున్నాయి. అటు ఎన్నికల విధుల్లో అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. లెక్క లేని నగదును స్వాధీనం చేసుకున్నారు అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడుల వ్యవహారం చర్చనీయాంశమైంది.