Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు కూడా లేదు. దీంతో ప్రచారం తీవ్ర రూపం దాలుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం మొత్తం ముగిసిపోతుంది. 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోప్రధాన పార్టీల అభ్యర్థులు టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీ ఏం పనులు చేసింది.. ఏ పార్టీ ఏ పథకాలు తెచ్చింది.. ఏ పార్టీ ప్రజల మనసులను చూరగొంది లాంటి వాటితో డిబేట్లు సాగుతున్నాయి.
న్యూ జెర్సీలోని జైస్వరాజ్య గ్లోబల్ టీవీ స్టూడియోలో సాగిన డిబేట్ లో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మోడరేటర్ గా డాక్టర్ శివకుమార్ ఆనంద్ చికినె, జై స్వరాజ్య గ్లోబల్ టీవీ డైరెక్టర్ వ్యవహరించగా. కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్ గుడ్ల, IOC తెలంగాణ చైర్మన్, బీజేపీ పార్టీ నుంచి విలాస్ జంబుల తెలంగాణ స్పోక్ పర్సన్ ఇన్ ఎడిషన్, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ తెలంగాణ పాల్గొన్నారు.
ఈ డిబేట్ కు ముఖ్య అతిథిగా డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి ఫౌండర్ యూబ్లడ్ యాప్ గారు కూడా పాల్గొన్నారు. తెలంగాణకు ఆయా పార్టీలు చేసిన పనులు, తెచ్చిన పథకాలు, తదితరాలను ఈ డిబెట్ లో చర్చించారు. ఈ డిబెట్ గ్లోబల్ టీవీలో ప్రసారం కావడంతో వరల్డ్ వైడ్ గా తెలంగాణ, ఏపీ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
All Images Courtesy : Dr. Shivakumar Anand Chikine (Jaiswaraajya Tv Global Director)