NTR Death Anniversary : శక పురుషుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని న్యూ జెర్సీలో వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. యూబ్లడ్ వ్యవస్థాపకులు, జైస్వరాజ్య టీవీ అధినేత డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు కార్యోన్ముఖులై పనిjai చేస్తున్నారు.
ఈ కార్యక్రమం గురించి జగదీష్ బాబు యలిమంచిలి గారు మాట్లాడుతూ శక పురుషుడు ఎన్టీఆర్ భారతావనిపై పుట్టాడం ప్రతీ ఒక్క భారతీయుడికి గర్వకారణం అన్నారు. ఎన్టీఆర్ జీవితం ఆసాంతం స్ఫూర్తి నింపుతుందని, సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి విరాజిల్లుతూనే ఉంటుందని జగదీష్ బాబు గారు అన్నారు. నిత్యం మదిలో ఉండే ఆ మహా మనిషిని స్మరించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.