జన సేన ముఖ్య నేత నాదేండ్ల మనోహర్ టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తుల దిశగా సాగుతున్నాయని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలీ మళ్లీ వైసీపీకే లాభం జరిగే అవకాశం ఉందని, ఈసారి ఓట్లు చీలనివ్వనని పవన్ పలు సందర్భాల్లో మాట్లాడారు. అందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారు. అందుకోసం తాను తెలదెంపులు చేసుకున్న బీజేపీతో కలిసేందుకు సిద్ధం అని సంకేతాలు అందించారు. కానీ బీజేపీ నుంచి ఏలాంటి సంకేతాలు రాలేదు.
అయితే గత రెండు క్రితం చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి చర్చలు జరిపారు పవన్. ఇప్పటికి పలు దఫాలుగా వీరిద్ధరు సమావేశమైన ఇప్పటి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వీళ్లిద్దరి ప్రధానంగా పొత్తులపైనే సాగిందని సమాచారం. జనసేన బీజేపీతో పొత్తులో ఉండడం, బీజేపీని కాదని టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరపడం చర్చకు దారితీస్తుంది. పవన్ కళ్యాన్ మాత్రం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నారు.
ఇప్పుడు ఈ చర్చలకు పుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేశాడు. విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది మా నినాదం అని, బాబు, పవన్ భేటీలో అదే కీలకం అంశమని స్పష్టం చేశారు. జగన్ పై ఏపీ ప్రజలు నమ్మకం కోల్పోయారు. లా అండ్ అర్డర్ పూర్తిగా ఫెయిలయ్యిందన్నారు. మంచి, ప్రణాళిక, వ్యూహంతో జనసేన ముందుకు సాగుతుందన్నారు. బీజేపీ మాత్రం జనసేన తమ భాగస్వామ్య పక్షమని, వచ్చే ఎన్నికల్లో కలిసే పోటాచేస్తామని అంటున్నారు. అయితే ఈ సందర్బంలో బీజేపీ పొత్తుపై మాత్రం ఏలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.