Gayathri Gupta సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కాస్టింగ్ కౌచ్ అనేది ఎంత కామన్ గా అయిపోయిందో మనందరికీ తెలిసిందే. చాలమంది దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మీటూ ఉద్యమం తర్వాత దీనిపై అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలామంది నటీమణులు దీని గురించి బహిరంగంగానే మాట్లాడుతూ వస్తున్నారు. అయితే మీటూ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చింది శ్రీరెడ్డి అని అనుకుంటారు.
కానీ వాస్తవానికి దీన్ని శ్రీరెడ్డి కంటే ముందే గాయత్రి గుప్తా తెరమీదకు తెచ్చింది. ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. ఆమె మొదట్లో చాలా బోల్డ్ పాత్రల్లో నటించింది. వాటితో యూత్ లో బాగా ఫేమస్అ యిపోయింది ఈ భామ. ఇక ఫిదా సినిమాలో సాయిపల్లవి ఫ్రెండ్ పాత్రలో చాలా కీలకమైన పాత్రలో మెరిసింది. దాని తర్వాత ఆమెకు బాగా గుర్తింపు వచ్చిందనే చెప్పుకోవాలి.
కానీ దాని తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. అయితే రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేసింది. నేను ఇండస్ట్రీలో కాస్గింగ్ కౌచ్ లేదని చెప్పను. ఎప్పటి నుంచో ఉంది. అవకాశాలు ఇస్తామని చెప్పి చాలామంది వాడుకుంటున్నారు.
అంతెందుకు నాకు కూడా ఛాన్సులు ఇస్తామని చెప్పి చాలామంది వాడుకున్నారు. వారి కోరికలు తీర్చుకున్నారు. కానీ ఛాన్సులు ఇవ్వలేదు. అందుకే నాలాగా అన్యాయం జరిగిన అమ్మాయిల తరఫున నేను వాయిస్ వినిపిస్తున్నాను. ఈ పోరాటం ఆపాలని అనుకోవట్లేదు. ఏదో ఒక రకంగా నా వాయిస్ వినిపిస్తూనే ఉంటాను అంటూ తెలిపింది గాయత్రి గుప్తా.